ఖాట్మండు, ఫిబ్రవరి 1: మహాకాళి నదిపై బ్రిడ్జి నిర్మాణానికి భారత్, నేపాల్ మంగళవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ మోటరబుల్ బ్రిడ్జి ఉత్తరాఖండ్లోని ధార్చులాను, నేపాల్లోని దార్చులాను కలుపుతుంది. ఈ బ్రిడ్జి నిర్మాణం ఖర్చును పూర్తిగా భారత ప్రభుత్వమే భరించనున్నది. పూర్తి ప్రాజెక్టు రిపోర్టు ఇప్పటికే పూర్తయిందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ బ్రిడ్జి నేపాల్లోని సుదుర్పాశ్చిమ్, ఉత్తరాఖండ్ మధ్య సరిహద్దు కనెక్టివిటీని మెరుగుపరచనున్నది.