వాషింగ్టన్: పెండ్లిలో మద్యం మత్తులో ఉన్న వరుడ్ని చూసి సహించని వధువు బావతో కలిసి పెండ్లి వేదిక నుంచి పరారైంది. అమెరికాలోని మేరీల్యాండ్లో ఈ ఘటన జరిగింది. 24 ఏండ్ల సియారియా, 28 ఏండ్ల సామ్ చాలా కాలంగా సీరియస్ రిలేషన్లో ఉన్నారు. దీంతో పెండ్లి చేసుకోవాలని వారిద్దరు నిర్ణయించుకున్నారు. పెండ్లి రోజున మాజీ ప్రియుడు, కజిన్ వరుసయ్యే 21 ఏండ్ల కైల్ పెండ్లికి సాక్షిగా ఆమె వెంట వచ్చాడు.
కాగా పెండ్లి, అనంతర జీవితంపై పలు ఆలోచనలు, టెన్షన్తో ఉన్న వధువు సియారియా, వరుడు సామ్ తాగి ఉన్నట్లు గ్రహించింది. కళ్లు తెరువలేని మత్తులో, సరిగా నిలబడని స్థితిలో ఉన్న వరుడు పెండ్లి ఉంగరాలను కూడా కింద పడేశాడు. దీనిని గమనించిన వధువు బాధను తట్టుకోలేకపోయింది.
మరోవైపు వధువు వెంట ఉన్న మాజీ ప్రియుడు, బావ వరుసైన కైల్ కూడా ఇది చూసి భరించలేకపోయాడు. ‘నీకు ఇలా జరుగడాన్ని చూస్తూ నేను కూర్చోలేను. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. అతడు మూర్ఖుడు. ఒక మూర్ఖుడిని నువ్వు వివాహం చేసుకోదలిచావా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాడు. ఒప్పుకుంటే ఇక్కడి నుంచి ఇద్దరం వెళ్లిపోదాం’ అని ఆమెతో అన్నాడు.
దీనికి సియారియా ఓకే అనడంతో వారిద్దరు పెండ్లి జరిగే చోటు నుంచి పరారయ్యారు. గత ఏడాది పెండ్లి సందర్భంగా తాను ఎదుర్కొన్న ఈ అనుభవాన్ని TLC ‘జిప్సీ వధువులు’ అనే కార్యక్రమంలో ఆమె పంచుకున్నది.