హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): ఉర్దూభాషను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పు ల ఈశ్వర్ పేర్కొన్నారు. ఉర్దూ అకాడమీ రూపొందించిన శౌకత్-ఇ-ఉస్మానియా పుస్తకాన్ని గురువారం మంత్రుల నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్కు ఉర్దూభాష పట్ల మక్కువ ఎక్కువ అని, దేశంలో ఎక్కడా లేనివిధంగా మైనార్టీ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని చెప్పారు. ద్వితీయ రాజభాషగా గుర్తింపు ఇచ్చిన చరిత్ర సీఎం కేసీఆర్దేనని స్పష్టంచేశారు. హైదరాబాద్ గొప్పతనాన్ని, 6, 7వ నిజాం రాజుల పాలనా విశేషాలను, నిర్మాణాలను కండ్లకుకట్టినట్టు పుస్తకంలో పొందుపరిచారని రచయిత, చరిత్ర పరిశోధకుడు ఎజాన్ను అభినందించారు. కార్యక్రమంలో మైనార్టీ వ్యవహారాల సలహాదారు ఏకే ఖాన్, ఉర్దూ అకాడమీ చైర్మన్ రహీముద్దీన్ అన్సారీ, డైరెక్టర్ ఎండీ గౌస్ తదితరులు పాల్గొన్నారు.