వాషింగ్టన్, అక్టోబర్ 16: యాపిల్ కంపెనీకి బ్రెజిల్లో భారీ షాక్ తగిలింది. యాపిల్ ఐ ఫోన్తోపాటు చార్జర్ ఇవ్వనందుకు బ్రెజిల్ కోర్టు ఆ కంపెనీకి రూ. 156 కోట్ల ఫైన్ విధించింది.
గతవారం బ్రెజిల్లో ఆర్డర్ చేసిన ఐఫోన్ 14, 14 ప్రో ఫోన్లకు చార్జర్లు ఇవ్వలేదంటూ దాఖలైన పిటిషన్పై విచారించిన న్యాయస్థానం ఈ తీర్పునిచ్చింది. బ్రెజిల్లో విక్రయించే ప్రతి యాపిల్ ఐఫోన్కు తప్పనిసరిగా చార్జర్ ఇవ్వాలని ఆదేశించింది.