బ్రెసిలియా: బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జెయిర్ బొల్సనారో( Jair Bolsonaro).. తన పాస్పోర్టును సరెండర్ చేశారు. 2023లో జరిగిన సైనిక తిరుగుబాటు కేసు దర్యాప్తులో భాగంగా ఆయన పాస్పోర్టును స్వాధీనం చేసుకున్నారు. అధికారంలో కొనసాగేందుకు బొల్సనారో సైనిక తిరుగుబాటుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. లూలా డ సిల్వా చేతిలో ఓటమి చెందిన తర్వాత ఆయన ఆ ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ కక్షతోనే తనపై దాడులు చేస్తున్నారని బొల్సనారో ఆరోపించారు. ఈ కేసులో బొల్సనారోకు చెందిన మరో ముగ్గురు కూడా అరెస్టు అయ్యారు. 2022 అక్టోబర్లో ఓటమి చెందిన తర్వాత బొల్సనారో మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకునే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఓ ఫ్రాడ్ కేసులో బొల్సనారో కుమారుడిపై కేసు నమోదు చేశారు. బ్యాంక్ రుణం కోసం తప్పుడు పత్రాలను సమర్పించినట్లు రీనన్ బొల్సనారో పై అభియోగాలు ఉన్నాయి. అతను మనీ ల్యాండరింగ్కు పాల్పడినట్లు కూడా అనుమానిస్తున్నారు.