తాలిబన్ల ఆక్రమణల తర్వాత వరుస పేలుళ్లతో ఆఫ్ఘానిస్థాన్ అట్టుడుకుతుంది. తాజాగా షియాలే లక్ష్యంగా కాందహార్లో భారీ బాంబు దాడి జరిగింది. శుక్రవారం సందర్భంగా ఇమామ్ బర్గా మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో బాంబు పేలి 16 మంది మృతి చెందారు. మరో 32 మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఇది ఆత్మాహుతి దాడిగా అనుమానిస్తున్నారు. కానీ ఈ దాడికి పాల్పడింది తామేనని ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. కాగా, గత శుక్రవారమే ఆఫ్ఘానిస్థాన్లోని కుందుజ్ ఫ్రావిన్స్లోని ఓ మసీదులో జరిగిన బాంబు దాడిలో 60 మంది దుర్మరణం చెందారు.