Joe Biden | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) జోర్డాన్ (Jordan) పర్యటన రద్దైంది. హమాస్తో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్కు మద్దతు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు ఇవాళ యుద్ధ భూమిలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ పర్యటన తర్వాత బైడెన్ జోర్డాన్ వెళ్లాల్సి ఉంది. అయితే, నిన్న గాజా ఆసుపత్రిపై దాడి ఘటనతో (Gaza Hospital Strike) అనూహ్యంగా బైడెన్ జోర్డాన్ పర్యటన రద్దైంది.
బైడెన్ నేడు ఇజ్రాయెల్లో పర్యటించనున్నారు. ఆ తర్వాత జోర్డాన్ వెళ్లాల్సి ఉంది. అక్కడ అరబ్ నేతలతో (Arab Leaders) సమావేశం నిర్వహించేలా ముందుగా ప్రణాళిక చేసుకున్నారు. జోర్డాన్ రాజు అబ్దుల్లా 2, ఈజిప్టు ప్రధాని ఎల్-సిసీ, పాలస్తీనా అధ్యక్షుడు మహ్ముద్ అబ్బాస్ తదితరులతో భేటీ కావాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం బైడెన్ జోర్డాన్ పర్యటన రద్దైనట్లు జోర్డాన్ విదేశాంగ మంత్రి ఐమన్ సఫాది తెలిపారు. అయితే ఇందుకు గల కారణాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. మరోవైపు, గాజా ఆసుపత్రి ఘటనపై బైడెన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విషయం తెలియగానే జోర్డాన్ రాజు అబ్దుల్లా, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో మాట్లాడారు.
Also Read..
Israel-Hamas War | గాజా ఆసుపత్రిపై దాడి ఉగ్రచర్యే.. ఈ ఘటనతో ఐడీఎఫ్కు సంబంధం లేదు : ఇజ్రాయెల్
Joe Biden | నేడు ఇజ్రాయెల్ పర్యటనకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
గాజా దవాఖానపై దాడి 500 మంది మృతి