వాషింగ్టన్, ఆక్టోబర్ 25: సైన్స్, టెక్నాలజీ రంగాల్లో విశేష కృషి చేసిన ఇద్దరు ఇండో అమెరికన్ శాస్త్రవేత్తలను అమెరికా అధ్యక్షుడు జో బైడన్ ఆ దేశ అత్యున్నత శాస్త్రీయ అవార్డులతో గౌరవించారు. సివిల్, ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్లో విశేష కృషి చేసిన గాడ్గిల్కు వైట్ హౌస్ నేషనల్ మెడల్ను, ఇంజనీరింగ్ ఫిజికల్ సైన్స్, లైఫ్ సైన్స్లలో చేసిన పరిశోధనలకు సుబ్రా సురేష్కు నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ను బైడెన్ మంగళవారం అందజేశారు.