థింపు: భూటాన్లో ప్రపంచ శాంతి ప్రార్థనలు(Global Peace Prayer) ప్రారంభం అయ్యాయి. నవంబర్ 4వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధ నేతలు, బిక్షువులు, శాంతి దూతలు పెద్ద స్థాయిలో ఆధ్యాత్మిక సమ్మేళనంలో పాల్గొంటున్నారు. భూటాన్ రాజధాని థింపూలో ఈ వేడుకలు జరుగుతున్నాయి. బజగురు, కాలచక్ర ప్రార్థనలు నిర్వహించనున్నారు.
బౌద్ధమతంలో ఉన్న భిన్నమైన సంప్రదాయాల ఆధ్యాత్మిక గురువులు శాంతి ప్రార్థనల ద్వారా ఐక్యత చాటనున్నారు. భూటాన్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. 13 రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి. ప్రఖ్యాత లామాలు, స్కాలర్స్, బౌద్ధ మతంలోని తీరవాడ, మహాయాణ, వజ్రాయన పద్ధతులను పాటించేవారు ఈ ప్రార్థనలకు హాజరవుతున్నారు. శాంతియుత, సంతోషకరమైన భవిష్యత్తు కోసం కావాల్సిన ప్రేమ, కరుణ గురించి అవగాహన క్రియేట్ చేయనున్నారు.
పవిత్రమైన జాబ్జీ దోహిచోగ్ క్రియతో గ్లోబల్ పీస్ ప్రేయర్ ఫెస్టివల్ను ప్రారంభించారు. చాలా అరుదైన ఈ పూజను అత్యంత వైభవంగా నిర్వహించారు. శరీరాన్ని, వాక్కును, నెగటివ్ మైండ్ను శుద్ధి చేసే ఉద్దేశంతో ఈ పూజా కార్యక్రమాన్ని చేపట్టారు. వివిధ బౌద్ధ సంప్రదాయాలకు చెందిన గురువులు ఇంగ్లీష్, టిబెట్, దోంగ్కా భాషలు ప్రార్థనలు చేపట్టనున్నారు.