ఇస్తాంబుల్: తుర్కియేలోని ఇస్తాంబుల్లో (Istanbul) ఉన్న ఓ స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్ (Football match) జరుగుతున్నది. తమ అభిమాన ఆటగాళ్లను ప్రత్యక్షంగా చూడటానికి భారీగా అభిమానులు తరలివచ్చారు. గెలుపుకోసం ప్లేయర్లు హోరాహోరీగా పోరాడుతున్నారు. ఇంతలో పిచ్పై వేల సంఖ్యలో బొమ్మలు వచ్చిపడుతున్నాయి. దీంతో మ్యాచ్ నిర్వాహకులు 4 నిమిషాలపాటు ఆటను నిలిపివేశారు. చూస్తుండగానే గ్రౌండ్లో కుప్పలుకుప్పలుగా బొమ్మలు (Toys) జమయ్యాయి. ఆటగాళ్లతో సహా స్టేడియం సిబ్బంది వాటిని తొలగించారు. అనంతరం మ్యాచ్ కొనసాగింది. ఇదేదో ఆటగాళ్లపై కోపంతో ప్రేక్షకులు బొమ్మలు విసిరారని అనుకోవద్దు.. భూకంప బాధిత చిన్నారులకు (Children) అందించడం కోసం వేసినవి.
"Bir başkadır benim memleketim…" pic.twitter.com/cipmCNXUry
— beIN SPORTS Türkiye (@beINSPORTS_TR) February 26, 2023
ఆదివారం తుర్కిష్ పుట్బాల్ సూపర్లీగ్లో (Turkish Super Lig) భాగంగా బెసిక్టస్ (Besiktas) పుట్బాల్ క్లబ్, అంటాలియాస్పోర్ (Antalyaspor) జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్నది. ఫ్యాన్స్తో స్టేడియం కిక్కిరిసిపోయింది. మధ్యలో మ్యాచ్ను 4 నిమిషాల 17 సెకన్ల పాటు మ్యాచ్ను నిలిపివేశారు. ఎందుకంటే ఫిబ్రవరి 6న తుర్కియే (Turkey), సిరియాలో (Syria) 4.17 నిమిషాలపాటు భారీ భూకంపం (Earthquake) వచ్చింది. ప్రకృతి ప్రకోపానికి ఇప్పటివరకు 50 వేల మంది చనిపోయిన విషయం తెలిసిందే. బిల్డింగ్లు కుప్పకూలిపోవడంతో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇక చిన్నారు సంగతి చెప్పాల్సిన అవసరం లేదు.
As the clock strikes 04:17 (the time of the earthquake), Beşiktaş fans throw thousands of soft toys onto the pitch to be sent to kids in the affected areas.
Again, proud that this is my club. I love this club.pic.twitter.com/mAJiykrMKr
— Can Okar (@canokar) February 26, 2023
ఈ ప్రకృతి విపత్తుకు గుర్తుగా నిర్వాహకులు మ్యాచ్ను 4 నిమిషాల పాటు నిలిపివేశారు. ఆ సమయంలో భూకంప బాధిత చిన్నారులకు సహాయంగా బొమ్మలు ఇచ్చేందుకు ప్రేక్షకులకు అవకాశం కల్పించారు. దీంతో సమయంకోసం వేచిచూస్తున్న ప్రేక్షకులు.. ఒక్కసారిగా ఫుట్బాల్పై పిచ్పైకి బొమ్మలు విసరడం ప్రారంభించారు. 4 నిమిషాల 17 సెకన్లు ముగిసేసరికి పిచ్పై వేలాది సంఖ్యలో బొమ్మలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో స్టేడియం సిబ్బంది, ఇరు జట్ల ఆటగాళ్లు వాటిని ఏరి ఓ పక్కకు పెట్టారు. అనంతరం తమ ఆటను కొనసాగించారు. అయితే ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలవలేదనుకోండి. ఒక్క గోలూ చేయకుండానే ఇరు జట్లు మ్యాచ్ను ముగించాయి. ప్రజలకు తమ క్లబ్పై ఉన్న అభిమానానికి ఇది నిదర్శమని బెసిక్టస్ ఫుట్బాల్ క్లబ్ ఓ ప్రకటనలో వెల్లడించింది. తుర్కియేలో బెసిక్టస్ ఫుట్బాల్ క్లబ్ అత్యంత ఆదరణ పొందిన జట్లలో ఒకటి. దీనిని 1903లో ఇస్తాంబుల్ జిల్లాలోని బెసిక్టస్లో టర్కిష్ స్పోర్ట్స్ క్లబ్ (Turkish sports club) ప్రారంభించింది.