ఢాకా: బంగ్లాదేశ్లో మరో ఘోరం జరిగింది. రెండు రోజుల క్రితం చిట్టగాంగ్లోని ఓ ఆక్సిజన్ ప్లాంటులో పేలుడు సంభవించి ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటనను మరువకముందే.. తాజాగా బంగ్లా రాజధాని ఢాకాలోని ఓ భవనంలో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ పేలుడు ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 70 మందికి పైగా గాయపడ్డారు.
వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుటాహుటిన సమీప ఆస్పత్రులకు తరలించారు. కాగా, పేలుడుకుగల కారణాలు తెలియరాలేదు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
At least 7 people killed, over 70 people injured in an explosion at a building in Bangladesh’s Dhaka: Local media #Dhaka #Bangladesh #DHAKABLAST pic.twitter.com/hbZLibPTrF
— DHIRAJ DUBEY (@Ddhirajk) March 7, 2023