మిచిగాన్: మానవుడి శరీర సాధారణ ఉష్ణోగ్రత ఒక్కసారిగా తగ్గిపోవడానికి పేగుల్లోని బ్యాక్టీరియా కారణమని యూఎస్లోని మిచిగాన్ వర్సిటీ మెడికల్ కాలేజీ పరిశోధకులు తేల్చారు. జ్వరం, ఇతర ఇన్ఫెక్షన్లు సోకిన 116 మందిపై అధ్యయనం నిర్వహించారు. ఎలుకల పేగుల్లోని బ్యాక్టీరియా, శరీర ఉష్ణోగ్రతల మధ్య సంబంధాన్ని పరిశీలించారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ప్రాణాంతక ఇన్ఫెక్షన్లకు గురైనప్పుడు కూడా పేగుల్లోని ఫర్మిక్యూట్స్ ఫైలమ్ బ్యాక్టీరియా శరీర ఉష్ణోగ్రతలను నియంత్రిస్తున్నట్టు కనుగొన్నారు. శరీరంలో సెప్టిక్ అయినప్పుడు కూడా ఉష్ణోగ్రతల్లో పెరుగుదలకు పేగుల్లోని బ్యాక్టీరియాలే కారణమని గుర్తించారు.