వాషింగ్టన్: అమెరికాలో గత వారం న్యూయార్క్, లాస్ ఏంజెల్స్, శాన్ఫ్రాన్సిస్కో తదితర ప్రాంతాల్లో టెలికం సేవల్లో ఏర్పడిన అంతరాయంపై ఏటీ అండ్ టీ కంపెనీ స్పందించింది. సిగ్నల్ సమస్యతో ప్రభావితమైన వినియోగదారులకు ఒక్కొక్కరికి ఐదు డాలర్ల చొప్పున పరిహారం అందించనున్నట్టు ఆదివారం ప్రకటించింది.
పోస్టు పెయిడ్ యూజర్లకు వచ్చే రెండు బిల్లింగ్ సైకిళ్లలో ఈ పరిహారాన్ని జమ చేస్తామని తెలిపింది. ప్రీపెయిడ్ యూజర్లకు పరిహారం విషయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నది. ఒకే సమయంలో అన్ని నెట్వర్క్లలో అంతరాయం తలెత్తడం చర్చనీయాంశంగా మారింది.