Afghanistan | బాగ్దాద్, మార్చి 18: అర్ధరాత్రి వేళ అఫ్గానిస్థాన్పై పాక్ సైన్యం వైమానిక దాడులకు దిగింది. పాక్టికా ప్రావిన్స్లోని బర్మాల్ జిల్లాలో, ఖోస్ట్ ప్రావిన్స్లోని సెపెరా జిల్లాలో ఈ దాడులు జరిగాయి. రెండు చోట్ల జరిగిన దాడుల్లో 8 మంది దుర్మరణం చెందారు.
సాధారణ పౌరుల నివాసాలే లక్ష్యంగా సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పాక్ ఈ దాడులకు పాల్పడిందని అఫ్గాన్ అధికార ప్రతినిధి జబీవుల్లా ముజాహిద్ తెలిపారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారని వెల్లడించారు.