కీవ్: తమ దేశంపై గురువారం రష్యా చేసిన రాకెట్ దాడిలో 50 మంది పౌరులు దుర్మరణం చెందారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు. హ్రోజా గ్రామంలో ఓ దుకాణం, కేఫ్పై రష్యా దాడి చేసినట్టు వెల్లడించారు. ఈ దాడిని ఉద్దేశపూర్వక ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు.
ఉక్రెయిన్కు మద్దతుగా నిలవాలని ఆయన గురువారం స్పెయిన్లో జరిగిన యూరోపియన్ నేతల సమావేశంలో పశ్చిమ దేశాలను కోరారు. దీనిపై ఆగ్రహంతోనే రష్యా రాకెట్ దాడికి పాల్పడిందని భావిస్తున్నారు.