ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని పెషావర్లో ఆత్మాహుతి దాడి జరిగింది. పోలీస్ లైన్స్ ప్రాంతంలో ఉన్న మసీదులో ఈ ఘటన చోటుచేసుకున్నది. ఈ దాడిలో సుమారు 70 మంది గాయపడ్డారు. గాయపడ్డవారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. మధ్యాహ్నం ప్రార్థనల సమయంలో పేలుడు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. మసీదులో ఓ వ్యక్తి తనతంట తాను పేల్చుకున్నట్లు భావిస్తున్నారు. తొలి వరుసలో ఉన్న వ్యక్తి ఆత్మాహుతికి పాల్పడినట్లు అంచనా వేస్తున్నారు. జోర్ ప్రార్థనలు జరుగుతున్న సమయంలో దాడి జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. మసీదు పేలుడులో 17 మంది మృతిచెందారు.