బీజింగ్: చైనాలోని జియాంగ్జి ప్రావిన్స్లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. 9 మంది గాయపడ్డారు. జిన్యూ నగరంలో బుధవారం మధ్యాహ్నం 3.24 గంటల ప్రాంతంలో ఓ దుకాణాల సముదాయంలోని స్ట్రీట్ షాప్లో మంటలు ప్రారంభమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు.