కారకాస్: వెనిజువెలాలో ఇవాళ కేవలం నిమిషం తేడాలో రెండు సార్లు భారీ భూకంపం(Venezuela Earthquakes) వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ భూకంపాల వల్ల 32 మంది మృతిచెందగా, 700 మంది గాయపడినట్లు ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలు రోడ్రిగేజ్ తెలిపారు. బుధవారం స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం ఆరు గంటల సమయంలో వెనిజువెలాలో రెండు సార్లు భూమి కంపించింది. తొలుత రిక్టర్ స్కేల్పై తీవ్రత 7.2 కాగా, ఆ తర్వాత 7.5 తీవ్రతతో భూ ప్రకంపనలు నమోదు అయ్యాయి. ఆ భూకంపాల ధాటికి భారీ బిల్డింగ్లు నేలమట్టం అయ్యాయి. లా గౌరియా ప్రాంతం తీవ్రంగా ప్రభావానినికి గురైంది.
డజన్ల సంఖ్యలో బిల్డింగ్లు కూలాయని, వీలైనంత వరకు అందర్నీ రక్షిస్తున్నామని, రెస్క్యూ ఆపరేషన్ చేపట్టామని, లా గౌరియా రాష్ట్రంలో పరిస్థితి భయానకంగా ఉందని అధ్యక్షురాలు రోడ్రిగేజ్ తెలిపారు. దేశ రాజధాని కారకాస్కు పశ్చిమ దిశలో 168 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరీబియన్ తీరంలోని మోరన్ ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకటించింది. సుమారు 22 కిలోమీటర్ల లోతులో భూమి కంపించినట్లు పేర్కొన్నారు. దాదాపు శతాబ్ధ కాలం తర్వాత వెనిజువెలాలో భారీ భూకంపం సంభవించింది.
మృతుల సంఖ్య లక్ష వరకు చేరుకునే అవకాశాలు ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొన్నది.