సియోల్: దక్షిణ కొరియా రాజధాని సియోల్లో హాలోవీన్ వేడుకల సందర్భంగా శనివారం భారీ తొక్కిసలాట చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో 120 మంది మృత్యువాతపడ్డారు. 100 మందికిపైగా గాయపడ్డారు. ఇటావోన్ ప్రాంతంలో ఇరుకు వీధి గుండా వేలాది మంది ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన సమయంలో తొక్కిసలాట చోటుచేసుకున్నది.
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. పెద్ద సంఖ్యలో ప్రజలు స్పృహలేని స్థితిలో పడి ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. కొవిడ్ తర్వాత తొలిసారి హాలోవీన్ వేడుకలు జరుగుతుండటంతో దాదాపు లక్ష మంది ప్రజలు ఈ ప్రాంతానికి చేరుకొన్నట్టు సమాచారం.