న్యూయార్క్, మే 18: అగ్ని పర్వతాలతో నిండి ఉన్న ఓ గ్రహాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. ఎరుపు రంగులోని ఓ మరుగుజ్జు నక్షత్రానికి 90 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గ్రహం భూమి పరిమాణంలో ఉన్నట్టు తేల్చారు. దీర్ఘవృత్తాకార కక్ష్యలో నక్షత్రం చుట్టూ ఈ గ్రహం తిరుగుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. తన చుట్టూ తాను తిరగకపోవడం వల్ల ఓ వైపు కాంతి, మరోవైపు చీకటితో నిండి ఉన్నట్టు వారు తెలిపారు. అగ్ని పర్వతాలు, నీటికి సంబంధం ఉంటుందని.. అగ్ని పర్వతాలు ఉన్నందువల్ల ఘన రూపంలో నీరు ఉండే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కోట్ల ఏండ్ల క్రితం భూమిపై వాతావరణం, జీవం ఎలా ఏర్పడిందో తెలుసుకునేందుకు ఈ గ్రహంపై చేసే ప్రయోగాలు ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.