న్యూయార్క్: వ్యోమగాములు పరిశోధనలు చేసేందుకు నెలల తరబడి అంతరిక్ష పరిశోధన కేంద్రంలో ఉంటు ంటారు. అలా ఉండటం వల్ల వారి డీఎన్ఏలో జన్యు పరివర్తనం జరుగుతున్నదని తాజా పరిశోధనల్లో గుర్తించారు. వ్యోమగాముల నుంచి తీసుకున్న రక్త నమూనాలపై 20 ఏండ్లుగా పరిశోధనలు జరిపారు.
జన్యుపరివర్తనాల కారణంగా వారు సులువుగా క్యాన్సర్ బారినపడే ప్రమాదం ఉంద ని తెలిసింది. వ్యోమగాములు అంతరిక్షంలో ఉన్న రేడియేషన్ బారిన పడ టం వల్లే ఇలా జరుగుతుందని చెబుతున్నారు. అలాగే నాడీకణ వ్యవస్థ బలహీనపడి, కణాలు త్వరగానే నాశనం అవుతాయని తెలిపారు.