హైదరాబాద్: ఓ భారీ గ్రహశకలం(Asteroid).. భూమికి సమీపంగా వెళ్లనున్నది. ఈ ఘటన ఏప్రిల్ 13వ తేదీన జరగనున్నది. ఆ ఆస్టెరాయిడ్ను 436774 (2012 KY3) లేదా 2012 KY3గా పిలుస్తున్నారు. భూమికి సుమారు 47,84,139 కిలోమీటర్ల దూరం నుంచి అది వెళ్తోంది. ఆ కిల్లర్ గ్రహశకలం సుమారు గంటకు 63,180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది.
2012 KY3 గ్రహశకలాన్ని నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్(Near Earth Object)గా పరిగణిస్తున్నారు. ఆ అస్టెరాయిడ్ సైజు అరకిలోమీటర్ నుంచి కిలోమీటర్ వెడల్పులో ఉంటుంది. కిలోమీటర్ సైజులో ఉన్న గ్రహశకలాన్ని ప్లానెట్ కిల్లర్(Planet Killer) ఆబ్జెక్ట్గా గుర్తిస్తారు. ఈ అస్టెరాయిడ్ వల్ల భూమికి ప్రస్తుతం ఎటువంటి ప్రమాదం లేదు.
ఈ గ్రహశకలాన్ని 2012లో గుర్తించారు. కానీ 1904 నుంచే ఆ అస్టెరాయిడ్ను జెట్ ప్రొపల్షన్ ల్యాబ్ ట్రాక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 2019లో చివరిసారి ఈ గ్రహశకలం భూమికి దగ్గరగా వచ్చింది. మళ్లీ 2025లో ఈ అస్టెరాయిడ్ భూమికి దగ్గరగా రానున్నది. సుమారు నాలుగేళ్ల పాటు ఈ గ్రహశకలం సూర్యుడి చుట్టు తిరగనున్నది.