ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శిగా వరుసగా రెండోసారి ఆంటోనియా గుటెరస్ నియమితులయ్యారు. యూఎన్ చీఫ్గా మళ్లీ గుటెరస్ ఎన్నికైనట్లు శుక్రవారం ప్రకటించారు. జనవరి 1, 2022 నుంచి మరో ఐదేండ్ల పాటు ఆయన ఆ పదవిలో కొనసాగుతారు.
ప్రధాన కార్యదర్శిగా మళ్లీ గుటెరస్కే అవకాశం ఇవ్వాలని ఇటీవల జరిగిన సమావేశంలో 15 దేశాల భద్రతా మండలి ఏకగ్రీవంగా తీర్మానించిన విషయం తెలిసిందే. తాజాగా 193 మంది సభ్యులున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆయన్ను సెక్రటరీ జనరల్గా నియమించింది. ఆంటోనియా 2017 నుంచి సెక్రటరీ జనరల్గా పనిచేస్తున్నారు. ఈ పదవిని చేపట్టిన తొమ్మిదో వ్యక్తి గుటెరస్.
ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషనర్గా 2005 నుంచి 2015 వరకు పనిచేశారు.