తైపేయి : తైవాన్ ప్రజలు చైనా దాష్టీకానికి ఎదురొడ్డి నిలిచారు. దేశాధ్యక్ష ఎన్నికల్లో చైనాను వ్యతిరేకించే డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (డీపీపీ)కి వరుసగా మూడోసారి పట్టం కట్టారు. ఈ ఎన్నికలు యుద్ధాన్ని లేదా శాంతిని ఎంచుకునేందుకు ఉపయోగపడతాయని చైనా చేసిన హెచ్చరికలను తైవాన్ ప్రజలు పట్టించుకోలేదు. శనివారం జరిగిన ఎన్నికల్లో డీపీపీ అభ్యర్థి లాయ్ చింగ్-టేను గెలిపించారు. తైవాన్ ప్రత్యేక అస్థిత్వాన్ని డీపీపీ బలంగా చాటి చెప్తుందనే సంగతి తెలిసిందే. తమ భూభాగంపై చైనా అధికారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పార్టీ అంగీకరించదు.