న్యూయార్క్, ఆగస్టు 20: అంటార్కిటికాలో వేగంగా వస్తున్న మార్పులు మిగతా ప్రపంచానికి పెనుముప్పుగా మారబోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భూతాపం కారణంగా ఈ మంచు ఖండంలో మంచు వేగంగా కరిగిపోతున్నది.
దీని ఫలితంగా ఈ ఖండం బరువు తగ్గుతున్నదని, క్రమంగా ఇది సముద్రమట్టానికి పైకి వెళ్తున్నదని అమెరికాలోని మసాచుసెట్స్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు గుర్తించారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా సముద్రమట్టం వేగంగా పెరిగే ముప్పు ఉందని చెప్పారు.
భూ తా పం తక్కువగా ఉంటే 2500 నాటికి సముద్రమట్టం 1.7 మీటర్ల మేర పెరుగుతుందని, భూతాపం ఎక్కువగా ఉంటే 19.5 మీటర్ల వరకు కూడా పెరగొచ్చని, సముద్రంలోకి ఎక్కువగా నీరు చేరడం వల్ల ఈ ముప్పు పెరుగుతున్నట్టు తెలిపారు.