వాషింగ్టన్, ఆగస్టు 2: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో మరో భారత సంతతి వ్యక్తి నిలిచారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు శివ అయ్యదురై ప్రకటించారు. స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నట్టు వెల్లడించారు.
1970లో అయ్యదురై కుటుంబం అమెరికాకు వచ్చి స్థిరపడింది. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి అయ్యదురై నాలుగు డిగ్రీలు పొందారు. ప్రస్తుతం వ్యాపార వేత్తగా, ఓ టెక్ కంపెనీకి ఫౌండర్గా, సీఈవోగా వ్యవహరిస్తున్నారు.