న్యూఢిల్లీ : భారత్కు చెందిన మరో వాణిజ్య నౌక ఎంటీ జల్వీర్(MT Jalveer)పై ఇవాళ అటాక్ జరిగింది. ఒమన్ తీరంలో ఆ నౌకపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఆ నౌకలో సుమారు 20 మంది భారతీయ నావికులు ఉన్నారు. నౌక నుంచి భారీ ఎత్తున నల్లటి పొగ విస్తరిస్తోంది. బహుశా డ్రోన్ దాడి జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. అయితే ఈ ఘటన పట్ల ఇంకా పూర్తిగా విషయాలు తెలియడం లేదని ఒమన్లోని భారతీయ ఎంబసీ పేర్కొన్నది. స్థానిక అధికారులతో దీనిపై సమాచారం సేకరిస్తున్నట్లు ఎంబసీ వెల్లడించింది. ఒమన్లోని సిన్హాస్ పోర్టు సమీపంలో ఘటన జరిగినట్లు అంచనా వేస్తున్నారు. అమెరికా-ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధం వల్ల హోర్ముజ్ జలసంధిలో ప్రస్తుతం ఉద్రిక్తకర వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.
సుమారు 18 టార్గెట్లపై అటాక్ చేసినట్లు తాజాగా ఐఆర్జీసీ పేర్కొన్నది. జోర్డాన్, కువైట్, బహ్రెయిన్లో ఉన్న అమెరికా స్థావరాలపై దాడి చేసినట్లు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటించింది. జోర్డాన్ అల్ అజ్రక్ ఎయిర్బేస్పై 12 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు ఐఆర్జీసీ తెలిపింది. అక్కడ అమెరికా తన జెట్స్ను స్టేషన్ చేసింది. ఎఫ్-15, ఎఫ్-16, ఎఫ్-35 విమానాలు అక్కడ ఉన్నట్లు తెలిసింది. తమ దాడిలో అమెరికాకు చెందిన అనేక యుద్ధ విమానాలు ధ్వంసం అయినట్లు ఇరాన్ పేర్కొన్నది. బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో ఆపరేషన్ చేపట్టినట్లు ఇరాన్ తెలిపింది.
please confirm 20 Indian Seafarers on board and if vessel is M.T. Jalveer ? @Indemb_Muscat https://t.co/s8eAIh8G06 pic.twitter.com/9WnCnuku8P
— FSUI (@FSUIINDIA) June 11, 2026