న్యూయార్క్: అమెరికాలో చదువుతున్న మరో భారత విద్యార్థి మరణించాడు. నెల రోజుల వ్యవధిలో ఇది నాలుగో మరణం. ఓహియోలోని లిండర్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో చదువుతున్న తెలుగు విద్యార్థి శ్రీయాస్రెడ్డి బెనిగేరి అనుమానాస్పద స్థితిలో మరణించినట్టు న్యూయార్క్లోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం తెలిపింది.
అతడి మరణానికి కారణాలు ఇంకా తెలియరాలేదని, పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారని వెల్లడించింది. భారత్లోని అతడి కుటుంబసభ్యులతో మాట్లాడామని, అన్ని రకాల సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. కాగా, అమెరికాలో ఈ నెల రోజుల్లో భారత విద్యార్థులు నీల్ ఆచార్య, వివేక్ సైనీ, అకుల్ బీ ధావన్ మరణించిన విషయం తెలిసిందే.