వాషింగ్టన్: భారత సంతతి బాలిక పెరియనాయగం నటషా (13) వరల్డ్ బ్రైటెస్ట్ స్టూడెంట్స్ జాబితాలో చోటుదక్కించుకుంది. నటషా ఈ జాబితాలో చోటు సంపాదించడం వరుసగా రెండో ఏడాది. అమెరికాకు చెందిన ‘జాన్ హప్కిన్స్ సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్’ ప్రతి ఏటా ఈ టాలెంట్ టెస్టును నిర్వహిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 76 దేశాల్లో 15 వేల మంది విద్యార్థులు రాసిన గ్రేడ్ లెవల్ పరీక్షల ఫలితాల ఆధారంగా జాన్ హప్కిన్ సెంటర్ ఈ జాబితాను రూపొందిందించి.
పెరియనాయగం నటషా న్యూ జెర్సీలోని ఫ్లోరెన్స్ ఎం గౌడినీర్ మిడిల్ స్కూల్లో విద్యాభ్యాసం చేస్తున్నది. ‘జాన్ హప్కిన్స్ సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్’ గత ఏడాది నిర్వహించిన టాలెంట్ టెస్టులో కూడా నటషా గ్రేడ్ 5 స్టూడెంట్గా నిలిచింది. సెంటర్ నిర్వహించిన అన్ని పరీక్షల్లో నటషా అద్భుతమైన ప్రతిభ కనబర్చిందని జాన్ హప్కిన్స్ యూనివర్సిటీ తన పత్రికా ప్రకటనలో పేర్కొన్నది.
పెరియనాయగం తల్లిదండ్రులు చెన్నై నుంచి అమెరికాకు వలస వెళ్లారు. నటషాకు డూడ్లింగ్ను ప్రేమిస్తుందని, ఖాళీ సమయాల్లో జేఆర్ఆర్ టోల్కిన్స్ నవలలు చదువుతుందని ఆమె పేరెంట్స్ చెప్పారు.