ఖాట్మాండు: తప్పించుకుని తిరుగుతున్న ఖలిస్తానీ నేత అమృత్పాల్ సింగ్(Amritpal Singh) ప్రస్తుతం నేపాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. నేపాల్(Neapal)లో దాగి ఉన్న అతను మరో దేశం వెళ్లకుండా అడ్డుకోవాలని ఆ దేశాన్ని ఇండియా కోరింది. ఇండియన్ పాస్పోర్టును వాడుకుని పారిపోవాలనుకుంటున్న అమృత్పాల్ను అరెస్టు చేయాలని కూడా నేపాల్ను ఇండియా కోరుకున్నట్లు తెలుస్తోంది.
ఖాట్మాండు(Khatmandu)లో ఉన్న ఇండియన్ ఎంబసీకి ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ లేఖ రాసింది. ఒకవేళ నేపాల్ నుంచి అమృత్పాల్ పారిపోవాలని చూస్తే అప్పుడు ఆయన్ను అరెస్టు చేయాలని ఆ లేఖలో కోరారు. ఈ నేపథ్యంలో నేపాల్లోని ఇమ్మిగ్రేషన్ శాఖ(immigration department)కు అభ్యర్థన లేఖ అందజేశారు.
మార్చి 18వ తేదీ నుంచి అమృత్పాల్ సింగ్ పరారీలో ఉన్నారు. అయితే అతని వేర్వేరు ఐడెంటిటీలతో పాస్పోర్టులు ఉన్నాయి. పంజాబ్ రాష్ట్ర పోలీసులు(punjab police) అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. కానీ ఓ నేపాల్ పత్రిక కథనం ప్రకారం అతను ఆ దేశంలో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.