వాషింగ్టన్, జూలై 28: ‘హెచ్-1బీ’ వీసా దరఖాస్తుదారులకు అమెరికా శుభవార్త చెప్పింది. అతి త్వరలోనే రెండో విడుత లాటరీ ప్రక్రియను చేపట్టనున్నట్టు వెల్లడించింది. ఇప్పటికే వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వీసాలను జారీ చేస్తామని తెలిపింది.
2024 కోటాను భర్తీ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. అమెరికా నిర్ణయంతో భారతీయులు ఎక్కువగా లబ్ధి పొందనున్నారు. ఆ దేశంలో ఐటీ, ఇతర కంపెనీల్లో పనిచేయాలనుకుంటున్న వారికి లబ్ధి చేకూరనున్నది.