Elizabeth Jones | భారత్తో జరుగుతున్న సైనిక విన్యాసాలపై చైనా అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో.. అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. సైనిక విన్యాసాలపై చైనాకు అమెరికా సూటిగానే జవాబు చెప్పింది. ఇరుదేశాల పరస్పర విషయాల్లో తల దూర్చడమెందుకు? అని చైనాను అమెరికా ప్రశ్నించింది. భారత్లో అమెరికా వ్యవహారాల ఇంఛార్జీ ఎలిజబెత్ జోన్స్ ఈ విషయాలను స్పష్టం చేశారు. భారత్తో కలిసి ఉండటమే తమ అభిమతమని వెల్లడించారు. భారత్-అమెరికా సైనిక విన్యాసాలు ఔలీలో గత నెల 15 న ప్రారంభమై శుక్రవారం డిసెంబర్ 2 న ముగిశాయి. ఈ విన్యాసాలు భారత్లో ఒక ఏడాది, అమెరికాలో ఒక ఏడాది జరుగుతాయి. గత ఏడాది అమెరికాలోని అలస్కాలో జరిగాయి.
‘భారత్తో అమెరికా సైనిక విన్యాసాలపై చైనా స్పందించడమేంటి..? చైనా అభ్యంతరాలు వ్యక్తం చేయడం సహేతుకం. ఇది ఇరుదేశాలకు సంబంధించిన విషయం. మీరు తలదూర్చకుండా ఉంటే చాలా మంచిది’ అని స్పష్టం చేశారు ఎలిజబెత్ జోన్స్. ఏ దేశంతోనైనా సైనిక విన్యాసాలు నిర్వహించేందుకు మాకు మూడో దేశం అనుమతి అవసరం లేదని భారతదేశం గురువారం తెలిపింది.
ఉత్తరాఖండ్లోని ఔలీలో చైనా సరిహద్దు సమీపంలో భారత్, అమెరికాల సైనిక విన్యాసాలు జరుగుతున్నాయి. దీనిపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. దీని వల్ల భారత్-చైనాల మధ్య విశ్వాసం దెబ్బతిని, బంధం బలపడదని చైనా చెప్తున్నది. ఈ విధానాన్ని సరిహద్దు ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని చైనా పేర్కొంటున్నది.