బీజింగ్, మే 1: చైనా కుబేరుడు, అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా కొత్త అవతారమెత్తారు. తమ కాలేజీలో విస్టింగ్ ప్రొఫెసర్గా పనిచేయాలంటూ టోక్యో కాలేజీ చేసిన విజ్ఞప్తిని ఆయన అంగీకరించారు. సోమవారం ఆయన విధుల్లో చేరారు.
వ్యాపార రంగంలో రాణించాలంటే కొత్త స్టార్టప్లను ఎలా ఏర్పాటు చేయాలి? వాటిని ఎలా విజయవంతంగా నడపాలి? తదితర అంశాలపై విద్యార్థులకు పాఠాలు చెప్పనున్నారు. అలాగే వ్యవసాయం, ఆహార ధాన్యాల ఉత్పత్తిపైనా విద్యార్థులతో కలిసి పరిశోధనలు చేయనున్నారు