విమానం నుంచి మానవ వ్యర్థాలు కిందకు పడిపోవడం ఏంటని అనుకుంటున్నారా? అది నిజమే. ఈ ఘటన యూకేలో చోటు చేసుకుంది. విండ్సర్ పట్టణం మీదుగా వెళ్తున్న విమానంలో నుంచి మానవ వ్యర్థాలు స్థానికంగా ఉన్న తోటలో పడిపోయాయి. అంతే కాదు.. ఆ తోటలో ఉన్న యజమాని కూడా మానవ వ్యర్థాల్లో మునిగిపోయాడు. ఈ ఘటన జులై నెలలో చోటు చేసుకుంది.
కానీ తాజాగా ఈ ఘటన గరించి స్థానిక కౌన్సెలర్ కరెన్ డేవిస్.. మెయిడెన్ హెడ్-విండ్సోర్లకు చెందిన విమానాయాన సంస్థ రాయల్ బరాగ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ విషయం ఇప్పుడు బయటకొచ్చింది. అయితే విమానాల్లో మానవ వ్యర్థాలను ప్రత్యేక ట్యాంకుల్లో నిల్వ చేస్తారు. విమానం ల్యాండ్ అయిన తర్వాత సిబ్బంది ఆ ట్యాంకులను వేరు చేసి వ్యర్థాలను పారవేస్తారు. చలి వల్ల విమానంలో టాయిలెట్స్ గడ్డకట్టి జామ్ కావడంతో ఇలా జరుగుతుంది. కానీ ఈ సారి గడ్డ కట్టలేదు. ఆ మలం మొత్తం నేరుగా అతడి తోటలో, అతడిపై పడింది. దీంతో అతను భయపడిపోయాడు.