న్యూయార్క్, సెప్టెంబర్ 24: బీపీ.. నిశ్శబ్ద హంతకి.. అన్ని రోగాలకు మూలం. అధిక రక్తపోటుకు, హార్ట్, బ్రెయిన్ స్ట్రోక్కు కారణమవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని 50 ఏండ్లు దాటినవారు క్రమం తప్పకుండా బీపీ చెక్ చేసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
50-80 ఏండ్ల మధ్య వయస్సున్న 1,247 మందిపై మిచిగాన్ యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు. వారిలో 48 శాతం మంది మాత్రమే క్రమం తప్పకుండా బీపీ చెక్ చేసుకుంటున్నారని, అవసరమైన మందులు వాడుతున్నారని తెలిపారు.