ఇస్లామాబాద్, ఫిబ్రవరి 6: ఇస్లామాబాద్లోని షియా మసీదు (ఇమామ్బార్గా) వద్ద శుక్రవారం ప్రార్థనల సమయంలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 31 మంది మరణించగా 169 మందికిపైగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చుకున్నట్లు వారు చెప్పారు. ఇటీవలి సంవత్సరాల్లో షియా ముస్లింలు లక్ష్యంగా ఉగ్రదాడి జరగడం ఇదే మొదటిసారి.
తర్లాయ్ ప్రాంతంలో గల ఖదీజా అల్-కుబ్రీ మసీదు-ఇమామ్బర్గా గేటు వద్దనే సూసైడ్ బాంబర్ని నిలిపివేయగా అక్కడే అతను తనను తాను పేల్చుకున్నట్లు పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఇస్ల్లామాబాద్ డీసీపీ ఇర్ఫాన్ నవాజ్ మెమోన్ ధ్రువీకరించారు.