అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సామాన్యులతోపాటే పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు కూడా వరుసగా మహమ్మారి బారినపడుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో ప్రస్తుతం ఆమె విశాఖపట్నంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆమె భర్త పరిక్షిత్ రాజుకు కూడా ఇటీవలే కరోనా సోకింది.