Pakistan | లాహోర్, జూన్ 3: దేవునిపై అభ్యంతరకర వ్యాఖ్యలతో పాటు, దూషణకు పాల్పడ్డాడనే ఆరోపణపై ఒక క్రైస్తవ యువకుడికి పాకిస్థాన్ కోర్టు శుక్రవారం మరణశిక్షను విధించింది.
లాహోర్కు 400 కిలోమీటర్ల దూరంలోని బహవల్పూర్లో ఇస్లామ్ కాలనీకి చెందిన 19 ఏండ్ల నౌమాన్ మసేహ దైవాన్ని దూషిస్తూ సామాజిక మాధ్యమాల్లో కొన్ని పోస్టులు షేర్ చేశాడని, అతనిపై కేసు నమోదు చేసిన అధికారులు వాట్సాప్ ద్వారా అతడు పంపిన మెస్సేజ్లను కోర్టులో సాక్ష్యంగా ప్రవేశపెట్టారు.
కేసు విచారించిన బహవల్పూర్ న్యాయస్థానం నిందితుడిపై మోపిన ఆరోపణలు రుజువు కావడంతో అతనికి మరణశిక్షతో పాటు, 20 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.