సిడ్నీ: ఆహారంలో మెగ్నీషియాన్ని అధికంగా తీసుకోవడం ద్వారా మెదడు చురుగ్గా ఉంటుందని, చిత్తవైకల్యం ముప్పు తగ్గుతుందని ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. 40-73 ఏండ్ల వయసున్న 6,000 మంది యూకే ప్రజలపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి ఈ విషయాలను వెల్లడించారు. సాధరణంగా ఒక రోజులో 350 మిల్లీగ్రాముల మెగ్నీషియం తీసుకునేవారి కంటే 550 మిల్లీగ్రాములు తీసుకునే వారి మెదడు వయస్సు ఏడాది తక్కువగా ఉంటున్నదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 41 శాతం అధిక మెగ్నీషియం తీసుకోవడం వల్ల వయస్సు మీద పడుతున్నా మెదడు పనితీరు మెరుగవుతుందని వెల్లడించారు.