Foreign Education | న్యూయార్క్, ఫిబ్రవరి 9: అమెరికాలో ఉన్నత విద్య.. ఆ తర్వాత మంచి జీతంతో ఉద్యోగం. ఇది చాలా మంది భారతీయ విద్యార్థుల కల. అయితే అమెరికాలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులతో లక్షలాది మంది విద్యార్థుల కల చెదురుతున్నది. కొవిడ్ తర్వాత పరిస్థితులు చాలా మారిపోయాయని, గత కొన్ని సంవత్సరాలుగా టెక్ రంగం జాబ్ మార్కెట్లో మందగమనం నెలకొనగా, అదేవిధంగా కాలేజీ ట్యూషన్ ఫీజులు విపరీతంగా పెరుగడంతో ఇప్పటికే చాలా మంది అమెరికా చదువంటే వెనకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నత విద్య కోసం అమెరికా రావడంపై పునరాలోచన చేయాలని భారతీయ విద్యార్థులకు అమెరికాలోని భారతీయ సీనియన్లు సూచనలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా అమెరికా కల నెరవేర్చుకునేందుకు రుణాలు చేసి మరీ మాస్టర్ డిగ్రీ పొందాలనుకుంటున్న విద్యార్థులు ఓ సారి పునరాలోచన చేయాలని అంటున్నారు. ఈ మేరకు పలువురు పెడుతున్న పోస్టులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
‘అమెరికాలో టెక్ ఉద్యోగాల స్వర్ణయుగం ముగిసింది. మీరు డిగ్రీ పట్టుకొని ఈ పరిస్థితుల్లో అమెరికా రావాలనుకొంటే సమయం, డబ్బు వృథా చేసుకోవడమే తప్ప ఏమీ ఉండదు. అధిక ఫీజులు, తక్కువ వేతనాలు, లాటరీలో హెచ్1బీ వీసా పొందే అవకాశం స్వల్పంగా ఉండటం.. గ్రీన్కార్డు పొందే అవకాశం లేకపోవడమే ఇందుకు కారణం’ అని ఒకరు పోస్ట్ పెట్టారు. లక్షలాది మంది ఎంఎస్ కోసం అమెరికా వస్తున్నారని, కోర్సు పూర్తయిన తర్వాత అందరికీ ఉద్యోగాలు రావడం అనేది కలేనని మరొక నెటిజన్ ట్వీట్ చేశారు.
అమెరికాలోని భారతీయులు ఎం చెప్తున్నారు?