Mega Millions jackpot | లాటరీ ద్వారా వేలు, లక్షల రూపాయలు గెలుచుకోవడం చూస్తుంటాం. మహా అయితే రూ.కోటి గెలుచుకుంటుంటారు. అయితే, అమెరికాలో ఓ సాధారణ పౌరుడు లాటరీ ద్వారా ఏకంగా రూ.వేల కోట్లు గెలుచుకుని వార్తల్లోకెక్కాడు. అతను గెలుచుకుంది.. వెయ్యి కోట్లో.. లేక, రెండు వేల కోట్లో కాదండోయ్. ఏకంగా రూ. పదివేల కోట్లు. ఆశ్చర్యంగా ఉంది కదూ..! మీరు విన్నది నిజమే. ఇందులో మరో విశేషం కూడా ఉంది. అదేంటో తెలియాలంటే వార్తను పూర్తిగా చదవండి.
అమెరికాలోని మైనేకి ప్రాంతానికి చెందిన ఓ సాధారణ వ్యక్తి ఇటీవల లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. జనవరి 13వ తేదీ (శుక్రవారం)న జరిగిన ‘మెగా మిలియన్స్’ జాక్పాట్ డ్రాలో గెలిచిన టికెట్ నంబర్తో అతని నంబర్లు సరిపోలాయి. దీంతో నిర్వాహకులు సదరు వ్యక్తిని జాక్పాట్ విజేతగా ప్రకటించారు. ఈ లాటరీలో అతనికి ఏకంగా రూ. 10,973 కోట్లు వరించాయి. సాధారణంగా విదేశాల్లో ఏదైనా నెలలో 13వ తేదీ శుక్రవారం దురదృష్టకరమైన రోజుగా పరిగణిస్తారు. అయితే, ఆ దురదృష్టకరమైన రోజే ఆ వ్యక్తికి అదృష్టం వరించడం మరో విశేషం.
లాటరీలో గెలుచుకున్న మొత్తాన్ని నిర్వాహకులు 29 సంవత్సరాల పాటు వాయిదాల పద్ధతిలో చెల్లిస్తారు. విజేతకు మొత్తం ఒకేసారి కావాలన్నా ఇస్తారు. అయితే, రూ.7వేల కోట్లు మాత్రమే చెల్లిస్తారు. చాలా మంది విడతల వారీగా కాకుండా ఒకేసారి తీసుకుంటుంటారు. ఇతనే కాదు.. గతంలో మరో వ్యక్తి కూడా లాటరీలో వేల కోట్లు గెలుచుకున్నాడు. 2018లో సౌత్ కరోలినాకు చెందిన వ్యక్తికి లాటరీలో రూ.12,436 కోట్లు వరించాయి.