టెల్ అవివ్, డిసెంబర్ 19: ఇజ్రాయెల్లో 2వేల ఏండ్ల కిందటి మట్టి క్యాండిల్ లభ్యమైంది. నాలుగో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు కిబ్బట్జ్ పరోడ్ ప్రాంతంలో దీన్ని గుర్తించారు. నేలకు అతుక్కొని ఉన్న క్యాండిల్ను చూసి వారు ఏదో ప్రత్యేకమైన రాయిగా భావించారు. దాన్ని తల్లిదండ్రుల సాయంతో ఇజ్రాయెల్ పురావస్తు అధికారుల దగ్గరికి తీసుకెళ్లారు.
వారు పరీక్షించి అది 2000 ఏండ్ల నాటి అరుదైన మట్టి క్యాండిల్ అని తేల్చారు. విద్యార్థులను పురావస్తు అధికారులు అభినందించి, ప్రశంసా పత్రాలు అందజేశారు.