బీజింగ్: చైనాలోని మూడవ అత్యధిక జనాభా కలిగిన హీనన్ ప్రావిన్సులో ఉన్న 90 శాతం మందికి కోవిడ్ సోకినట్లు ఆరోగ్యశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్లో జీరో కోవిడ్ పాలసీని ఎత్తివేసిన తర్వాత చైనాలో మళ్లీ కరోనా పంజా విసిరిన విషయం తెలిసిందే.
హీనన్ ప్రావిన్సులో జ్వరంతో ఆస్పత్రులను సందర్శించిన రోగుల సంఖ్య డిసెంబర్ 19వ తేదీన ఎక్కువగా ఉన్నట్లు అధికారి క్వీన్కాంగ్ తెలిపారు.ఆ తర్వాత కేసుల సంఖ్యలో తగ్గుదల చూపించినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చెప్పినదానికి, రాష్ట్ర సర్కార్ ఇస్తున్న సమాచారానికి భారీగా తేడా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.