శాన్ఫ్రాన్సిస్కో, అక్టోబర్ 21: సామాజిక మాధ్యమం ట్విట్టర్ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేస్తే భారీస్థాయిలో ఉద్యోగులను తొలగిస్తారా? అంటే పలు నివేదికలు అవుననే అంటున్నాయి. దాదాపు 75 శాతం మందిని తొలగించే ప్రణాళికతో మస్క్ ఉన్నారని చెప్తున్నాయి. ఈ మేరకు వాషింగ్టన్ పోస్ట్ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. ఉద్యోగుల నియామకాలను భారీగా తగ్గించామని ట్విట్టర్ గత జూలైలో ప్రకటించింది.