వాషింగ్టన్: అమెరికాలో గన్కల్చర్ నానాటికి పెరిగిపోతున్నది. కాలేజీలు, స్కూళ్లు అనే తేడా లేకుండా అన్నివయస్కుల వాళ్లు తుపాకులతో కాల్పులకు తెగబడుతున్నారు. అయితే వర్జీనియాలోని రిచ్నెక్ ఎలిమెంటరీ స్కూల్లో (Richneck Elementary School) విస్తుపోయే ఘటన చోటుచేసుకున్నది. స్కూల్లో చదువుతున్న ఆరేండ్ల కుర్రాడు తరగతి గదిలోనే టీచర్పై గన్తో కాల్పులు జరిపాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉన్నదని స్థానిక పోలీస్ చీఫ్ స్టీవ్ డ్రూ చెప్పారు. విద్యుర్థులకు ఎలాంటి హానీ జరుగలేదన్నారు. నిందితుడైన ఆరేండ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఇది ప్రమాద వషాత్తు జరిగిందేమీ కాదని చెప్పారు.
కాగా, అమెరికాలోని స్కూళ్లలో కాల్పులు జరగడం పరిపాటిగా మారింది. గత మే నెలలో టెక్సాస్లో జరిగిన ఘటనలో 19 మంది విద్యార్థులతోపాటు ఇద్దరు టీచర్లు చనిపోయిన విషయం తెలిసింది. ఇక గతేడాది అమెరికాలో తుపాకీతో కాల్పుల వల్ల 44 వేల మందికిపైగా చనిపోయారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో హత్యలు, తమను తాము రక్షించుకోవడానికి కాల్పులు జరపడం, ఆత్మహత్యల వంటివి ఉన్నాయని వెల్లడించారు.