బ్యాంకాక్, సెప్టెంబర్ 7: కరోనా వైరస్ ప్రబలి మూడేండ్లు అవుతు న్నా.. వైద్య చికిత్సకు అది కొత్త సవాళ్లను విసురుతున్నది. థాయిలాండ్లో కొవిడ్బారిన పడ్డ 6 నెలల బాలుడికి వైద్య చికిత్స తర్వాత.. అతడి కండ్లు నీలిరంగులోకి మారాయి. ఈ పరిణామం వైద్యులను ఆశ్చర్యానికి గురిచేసింది. మందుల దుష్ప్రభావంతోనే కండ్ల రంగు మారినట్టు వైద్యులు అం చనావేశారు. దీనిపై ‘ఫ్రాంటియర్స్ ఇన్ పిడియాట్రిక్స్’ జర్నల్ వెలువరించిన కథనం ప్రకారం.. కొవిడ్తో బాలుడు ఒక రోజంతా జ్వరం, దగ్గు తో బాధపడ్డాడు.
బ్యాంకాక్లోని దవాఖాన వైద్యులు ‘ఫావిపిరావిర్’ డ్రగ్ను మూడు రోజులపాటు బాలుడికి అందించారు. ఆ తర్వాత కొవిడ్ లక్షణాలు తగ్గుముఖం పట్టినప్పటికీ, 18 గంటల దాటాక కండ్లు నీలం రంగులోకి మారటాన్ని బాలుడి తల్లి గుర్తించింది. ఐదు రోజుల తర్వాత బాలుడి కండ్లు సాధారణ స్థితికి చేరుకోవటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.