న్యూయార్క్, ఫిబ్రవరి 12: అమెరికా పౌరసత్వం పొందుతున్న వారిలో భారతీయులు అగ్రభాగాన ఉన్నారు. 2023 సంవత్సరంలో అత్యధిక అమెరికా పౌరసత్వాలు పొందిన రెండో దేశంగా భారత్ నిలిచింది. గత ఏడాది అమెరికా 8,78,500 మందికి కొత్తగా పౌరసత్వం జారీచేసింది. వీరిలో 59,100 మంది భారతీయులు ఉన్నట్టు అమెరికా పౌరసత్వ, వలసల సేవా విభాగం (యూఎస్సీఐఎస్) తాజా వార్షిక నివేదికలో వెల్లడించింది. గత ఏడాది మొత్తంగా అమెరికా పౌరసత్వం పొందిన విదేశాలకు చెందిన వారిలో 6.7 శాతం మంది భారతీయులే ఉండటం గమనార్హం. ఈ జాబితాలో 1.1 లక్షల పౌరసత్వాలతో మెక్సికో మొదటి స్థానంలో నిలిచింది. మూడు, నాలుగు స్థానాల్లో ఫిలిప్పీన్స్, డొమినిక్ రిపబ్లిక్ నిలిచాయి. ఒక విదేశీ వ్యక్తి అమెరికా పౌరుడు కావాలంటే ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ చట్టంలోని నిబంధనలకు అర్హత సాధించాల్సి ఉంటుంది. ఒక వ్యక్తికి అమెరికా పౌరసత్వం జారీ చేయాలంటే అంతకుముందు అతను ఐదేండ్ల పాటు ఆ దేశంలో చట్టబద్ధమైన నివాసిగా ఉండాల్సి ఉంటుంది.
2023లో అమెరికా పౌరసత్వాల జారీ
దేశం పౌరసత్వాల సంఖ్య శాతం