దుబాయ్: సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్బేస్లో ఉన్న రీఫ్యూయలింగ్ విమానాల(Refueling Planes)పై ఇరాన్ క్షిపణి దాడి చేసింది. ఆ దాడుల్లో సుమారు అయిదు రీఫ్యూయలింగ్ విమానాలు స్వల్పంగా ధ్వంసమైనట్లు తెలిసింది. అమెరికాకు చెందిన ఓ మీడియా ఈ కథనాన్ని రాసింది. సౌదీ బేస్లో ఉన్న విమానాలపై ఇటీవల దాడి జరిగిందని, ఆ దాడిలో స్వల్పంగా ఆ విమానాలు దెబ్బతిన్నాయని, కానీ అవి పూర్తిగా ధ్వంసం కాలేదని ఆ రిపోర్టులో పేర్కొన్నారు. దెబ్బతిన్న రీఫ్యూయలింగ్ విమానాలకు రిపేర్ చేస్తున్నట్లు తెలిపారు.
ఇక అమెరికాకు చెందిన రీఫ్యుయలింగ్ విమానం .. ఇరాక్ గగనతలంలో గురువారం రాత్రి కూలిన విషయం తెలిసిందే. అయితే ఆ దుర్ఘటనలో ఆ విమానంలో ఉన్న ఆరుగురు మృతిచెందినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. కేసీ-135 విమానం రీఫ్యుయలింగ్ చేస్తున్న సమయంలో కూలింది. పశ్చిమ ఇరాక్ ప్రాంతంలో ఆ విమానం కూలింది. అయితే మరో విమానం మాత్రం సేఫ్గా ల్యాండ్ అయినట్లు సెంట్రల్ కమాండ్ చెప్పింది.
రీఫ్యుయలింగ్ విమానం ఎందుకు కూలిందన్న కోణంలో దర్యాప్తు జరుగుతున్నట్లు అమెరికా మిలిటరీ అధికారులు చెప్పారు. అయితే శత్రు దేశమో లేక స్నేహపూర్వక ఫైరింగ్లో ఆ విమానం కూలలేదని మాత్రం అధికారులు వెల్లడించారు.
⚡️ BREAKING — Unusual | Wall Street Journal:
Five U.S. refueling aircraft were damaged at Prince Sultan Air Base in Saudi Arabia 🇸🇦 after an Iranian missile attack.
The aircraft are currently under repair, and no casualties were reported. pic.twitter.com/J7KMHL1zHM
— Russia TV (@Urgent_RussiaTV) March 14, 2026