టైగ్రే: ఇథియోపియాలో తీవ్ర కరువు తాండవిస్తున్నది. టైగ్రే ప్రాంతంలో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ఆ ప్రాంతంలో సుమారు నాలుగు లక్షల మంది తిండి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 8 నెలలుగా ఆ ప్రాంతంలో నెలకొన్న సంక్షోభం వల్ల మిలియన్ల సంఖ్యలో జనం అల్లాడుతున్నారని, వారిని ఆదుకోవాలంటూ ఐక్యరాజ్యసమితి ప్రపంచదేశాలను కోరింది. ఇథియోపియా ప్రభుత్వ దళాలు, టైగ్రే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్(టీపీఎల్ఎఫ్) మధ్య జరుగుతున్న ఘర్షణలతో ఆ ప్రాంతం అట్టుడుకుతున్నది. ఈ ప్రాంతంలో ఉన్న 33 వేల మంది పిల్లలు పోషకాహారలోపంతో సతమతమవుతున్నారు. మరో 18 లక్షల మంది కరువులోకి వెళ్లే ప్రమాదం ఉన్నట్లు కూడా యూఎన్ హెచ్చరించింది.