హైదరాబాద్ : రష్యా బాంబు దాడులకు ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఉక్రెయిన్కు చెందిన 40 మంది సైనికులు, 10 మంది పౌరులు మృతి చెందినట్లు ఆ దేశ ప్రెసిడెంట్ కార్యాలయం ప్రకటించింది. రష్యా చేపట్టిన మిలటరీ ఆపరేషన్లో వందలాది మంది తీవ్రంగా గాయపడినట్లు తెలిపింది. రష్యా ప్రకటించిన యుద్ధంలో సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది.
రష్యాను నిలువరించేందుకు ముందుకు రావాలని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఇక రష్యాకు చెందిన ఐదు రష్యా విమానాలు, ఒక హెలికాప్టర్ను కూల్చేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. ఉక్రెయిన్ డిప్యూటీ ఇంటీరియర్ మినిస్టర్ ఆంటన్ మాట్లాడుతూ.. మిలటరీ హెడ్ క్వార్టర్స్, ఎయిర్పోర్టులు, మిలటరీ వేర్హౌస్లపై రష్యా బాంబు దాడులు చేసిందని తెలిపారు.